అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ మహిళ స్థానికంగా ఉంటున్న వారి నుంచీ భారీ మొత్తంలో డబ్బు కాజేసి మోసం చేసిందని వచ్చిన ఫిర్యాదుతో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సాక్ష్యాధారాలతో సహా ఆమె పై బలమైన ఫిర్యాదులు ఉండటంతో ఆమెకి భారీ స్థాయిలో జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలలోకి వెళ్తే.
న్యూయార్క్ లో క్వీన్ సిటీస్ లో ఉంటున్న రెష్మీమహారాజ్ అనే భారత సంతతికి చెందిన మహిళ తన మాయ మాటలతో సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి ఆశలు చూపించేది.
వారిని నమ్మించి లక్షలకి లక్షలు సొమ్ము వారినుంచీ తీసుకుని జల్సాలు చేసేది.ఈ క్రమంలోనే మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెని అరెస్ట్ చేశారు పోలీసులు.
దాంతో మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి.దాంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో ఆమె అసలు వ్యవహారం బయట పడింది.
సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకునే వారిని టార్గెట్ గా చేసుకుని చాలా మంది వ్యక్తుల నుంచీ గత కొన్నేళ్లుగా లక్షలకి లక్షలు దోచుకున్న ఆమె జల్సాలు చేసేదని డబ్బులు ఎవని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరిగేదని భాదితులు వాపోయారు.సాక్ష్యాధారాలతో సహా కోర్టులో హాజరుపరిచిన ఆమెకి భారీ జరిమానాతో పాటు, ఆరేళ్ళ జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు