పొరుగుదేశం పాకిస్థాన్ ఎంత తీవ్ర స్థాయిలో ఆర్ధిక సంక్షోభం ఎదురుకొంటున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఆర్ధిక సంక్షోభం ఎంతవరకు చేరుకుంది అంటే ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ కే కరెంట్ నిలిపివేసేంతగా.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా విద్యుత్ బిలులు చెల్లించలేదన్నకారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ కు కరెంట్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.ఒకపక్క దేశంలో తీవ్ర స్థాయిలో ఆర్ధిక సంక్షోభం ఎదురుకొంటున్న పాక్ మరోపక్క భారత్ కు అక్టోబర్ లేదా నవంబర్ లో యుద్దానికి సై అంటూ తెగ తొడకొడుతుంది.
విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ప్రధాని కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ హెచ్చరించింది.గతంలో కూడా పలుసార్లు హెచ్చరించినా ఈ బకాయిల పై ఎలాంటి స్పందన రాకపోవడం తో ప్రధాని కార్యాలయానికి కరెంట్ ను కట్ చేసారు అధికారులు.దాదాపు రూ.41 లక్షల విద్యుత్ బిల్లు బకాయిపడినట్లు తెలుస్తుంది.వారి నిర్లక్ష్యం కారణంగా.విద్యుత్ ఉత్పత్తిచేస్తున్న ప్రైవేటు సంస్థలకు తాము బిల్లులు చెల్లించలేకపోతున్నట్టు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ పేర్కొంది.
ఇక తాము వేచిచూడలేమని.ప్రధాని కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని నోటీసులిచ్చారు.
ఇలా ఒకపక్క ఆర్ధిక సంక్షోభం తో మరోపక్క విద్యుత్ కొరత తో తెగ ఇబ్బందులు పడుతున్న పాక్ పక్క దేశానికి మాత్రం యుద్ధం చేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తుండడం గమనార్హం.