ఢీ అంటే ఢీ అంటున్న నేతలు!

ప్రకాశం జిల్లా లో ఢీ అంటే ఢీ అంటున్నారు టీడీపీ,వైసీపీ నేతలు.వారే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి,దామచర్ల జనార్దన్ రావు.

 Clashesbetweenbalineni Srinivas Anddamacharla Janardhan-TeluguStop.com

ఇద్దరూ కూడా బలమైన రాజకీయ కుటుంబ వారసత్వం ఉన్నవారే కావడం తో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.ఒకరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గరివారైతే…మరొకరు మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితులు.

దీనికితోడు ఇద్దరూ వైసీపీ, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారే కావడం తో ఇప్పుడు ఇది రాజకీయంగా వేడి రాజుకుంది.వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతుండడం తో ఈ వివాదం కాస్త వీరిద్దరి మధ్యకు చేరుకుంది.

దీనితో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇద్దరూ మీడియా సాక్షిగా సై అంటే సై అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.నిన్నమొన్నటి వరకూ ద్వితియ శ్రేణి నాయకుల మధ్య చిన్నపాటి గొడవలు కాస్తా ముదిరి ఇప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్థన్‌గా మారుతున్నాయి.

ఇద్దరూ వైసీపీ, టీడీపీ పార్టీల జిల్లా అధ్యక్షులు కావడంతో రెండు పార్టీల నాయకుల్లోనూ ఇది చర్చకు దారితీస్తోంది.

ఇటీవల టీడీపీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే దీని వెనుక మంత్రి బాలినేని కుమారుడు ప్రనీత్ రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆ జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ సైతం నేరుగా ఆరోపణలు చేయడం తో ఈ వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube