అమెరికాలో ఉంటున్న భారత జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన పండిట్లు చాలా మంది అమెరికా వీదుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా, కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించినట్టుగా వారు తెలిపారు.
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు వరంలాంటిదని అన్నారు.
వాషింగ్టన్ లోని సీఎన్ఎన్ ఆఫీసు ఎదుట నిర్వహించిన ఈ ర్యాలీలో , కశ్మీరి పండిట్లతో పాటు, ఎంతో మంది ప్రవాస భారతీయులుకూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అమెరికన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ.భారత ప్రభుత్వం ఎంతో ధృడమైన నిర్ణయాన్ని తీసుకుంది, జమ్మూ కశ్మీర్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని అన్నారు.
అక్కడ ఉండే ప్రత్యేక హక్కులు కశ్మీర్లోని మైనారిటీలకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.అక్కడి షియాలు, దళితులు, కశ్మీరీ పండిట్లు మొదలగు వారందరూ ఎన్నో కష్టాలు అనుభవించిన వారే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ బాధలు అన్నీ తొలగిపోతాయని మైనారిటీలకి ఇప్పుడు పూర్తి స్వేఛ్చ దోర్కిందని అన్నారు.