యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం తన మూడవ సినిమా ఏర్పాట్లలో ఉన్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈయన రెండవ సినిమా ‘మన్మధుడు 2’ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది.
మొదటి సినిమాకు జాతీయ అవార్డు వస్తే రెండవ సినిమాకు కనీసం బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ కూడా నమోదు కాలేదు.దాంతో తీవ్ర నిరాశలో ఉన్న రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం మూడవ సినిమా పనులు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.
మన్మధుడు 2 చిత్రం విడుదలై నెల రోజులు కూడా కాకుండానే అప్పుడే రాహుల్ కొత్త సినిమాను మొదలు పెట్టాడు.ఇటీవలే రాహుల్ చెప్పిన స్టోరీ లైన్కు నాని ఓకే చెప్పాడని.వీరిద్దరి మద్య చర్చలు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం నాని కమిట్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి అయిన వెంటనే వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.
ఇక ఈ చిత్రం గురించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మన్మధుడు 2 చిత్రంలో నాగార్జునకు జోడీగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్నే మరోసారి ఈ చిత్రంలో నాని ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రకుల్ ప్రీత్ సింగ్ చాలా కాలంగా రాహుల్కు మరియు ఆయన భార్య చిన్మయికి స్నేహితురాలు.ఆ కారణంగా నాని సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే గత కొంత కాలంగా ఆమె కెరీర్ పరంగా ఏమాత్రం బాగాలేదు.అందుకే నాని సినిమాలో ఆమెను తీసుకోవడం సరైన నిర్ణయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.