గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడం ఏమో గానీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు మాత్రం కష్టాలు అలా అలా వచ్చిపడుతున్నాయి.ఇప్పటికీ కోడెల,అతని ఫ్యామిలీ పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.
అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కోడెల పై అతని కుమారుడు,కుమార్తె పై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుంది.అధికారాన్ని దుర్వినియోగం చేసి తండ్రి పేరు అడ్డంపెట్టుకొని కోడెల కుమారుడు శివరామ్ అక్రమంగా చాలా ఆర్జించాడు అంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా శివరామ్ కు చెందిన గౌతమ్ హోండా షోరూం ను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది.వాహనాలు కొనుగోలు చేసి ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా వాహనాలు అమ్మినట్టు నిర్ధారించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా దాదాపు 40 వేల టూ విలర్ వాహనాల ట్యాక్స్ను గౌతం హోండా షోరూమ్ ఎగవేసిందని అధికారులు చెబుతున్నారు.మరోపక్క దీనిపై కోడెల శివప్రసాద్ స్పందిస్తూ 60 రోజుల్లో వైసీపీ పాలన కలుషితంగా మారిందంటూ మండిపడ్డారు.
పోలీసులకు కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల సొంత పార్టీ లో కూడా కోడెల పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.కోడెల న్యాయకత్వం మాకు వద్దు అంటూ కొందరు నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు కు మెరపెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఇలా ఒక్కోదేబ్బ పడుతూ కోడెల కోలుకోలేకుండా అయిపోతున్నారు.