కాశ్మీర్ ఇష్యూపై ఐరాస పెట్టిన నిబంధన పాకిస్తాన్ కి నోట్లో పచ్చి వెలక్కాయ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరు సమస్యపై పాకిస్తాన్ ప్రపంచ దేశాల ద్రుష్టికి ఇష్యూని తీసుకొని రచ్చ చేయాలని ప్రయత్నం చేస్తుంది.అయితే కాశ్మీర్ అనేది అంతర్గ్హత సమస్య అని ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని ఇతర దేశాలు తేల్చి చెప్పేసాయి.

 Unesco Report On Press Freedom Released On Kashmir-TeluguStop.com

ఇక అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్ అంగీకరించకపోవడం వారు కూడా చేతులెత్తేశారు.దీంతో ఈ అంశం మీద తమకి న్యాయం చేయాలని ఐక్యరాజ్యసమితి దగ్గరకి పాకిస్తాన్ వెళ్ళింది.

అయితే ఐరాస ఈ వ్యవహారంపై తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పాకిస్తాన్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది.జమ్మూ-కశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తూ ఐరాసలో చేసిన తీర్మానంపై భద్రతా మండలి ఆమోదం తెలిపింది.

జమ్మూ-కశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి 3 నిబంధనలను ఏర్పాటు చేసింది.జమ్మూ-కశ్మీరులో సాధారణంగా నివసించని గిరిజనులు, పాకిస్థానీ జాతీయులను అక్కడి మొదటిగా పసంహరించుకోవాలి.గిరిజనులు, పాకిస్థానీలు ఈ రాష్ట్రంలోకి చొరబాట్లను నిలువరించేందుకు, పోరాటాలు చేసేందుకు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యిపోయి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు.వీరందరూ దేశం విడిచి వెళ్ళడంతో పటు రాష్ట్రంలో పోరాడుతున్నవారికి సహాయాన్ని అందించరాదని కూడా ఈ నిబంధన తెలిపింది.

పాకిస్థానీ గిరిజనులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్లు భద్రతా మండలి నియమించిన కమిషన్ సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే భారత దేశం తన దళాలను క్రమంగా తగ్గించాలని ఈ నిబంధన తెలిపింది.అయితే ఈ నిబంధన ప్రకారం పాకిస్తాన్ కి రివర్స్ పంచ్ పడుతుంది.

కాశ్మీర్ పై ప్రజాభిప్రాయం జరగాలంటే దేశంలోకి చొరబడ్డ అందరూ దేశం విడిచి వెళ్ళాలి.అలా జరిగితే కాశ్మీర్ మీద పాకిస్తాన్ పట్టు కోల్పోతుంది.

దీంతో ఈ విషయంలో పాకిస్తాన్ ఏమీ చేయలేక సైలెంట్ అయిపొయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube