ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుస నిర్ణయాలతో సంచలనం సృస్తిస్తుననాడు.తాను హామీ ఇచ్చిన నవరత్నాలు అమలు చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు.
అదే సమయంలో గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చేసాడు.మరో వైపు మద్యం బెల్ట్ షాపులు నియంత్రించే పని మొదలెట్టాడు.
ఇలా ప్రజాకర్షక పనులు చేస్తున్న జగన్ కి మరో వాపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి సెగ తగులుతుంది.జగన్ తీసే ఉద్యోగాల కారణంగా ఇంత కాలం ప్రభుత్వం పథకాలలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేసిన చాలా మంది రోడ్డున పడే అవకాశం ఉంది.
ఈ నేపధ్యంలో వీరంతా ఇప్పటికే రోడ్డెక్కారు.
ఇదిలా ఉంటే ఇన్ని పథకాలు అమలు చేయడానికి రెడీ అయిన జగన్ కి బడ్జెట్ సహకరించడం లేదు.
ఇప్పుడు ఏపీ అభివృద్ధితో పాటు, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల జీతాలు, అలాగే సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ చాలా ఎక్కువ మొత్తంలో అవసరం ఉంది.మరో వైపు ప్రతి నేల వడ్డీ రూపంలో లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
అయితే ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో అలాగే స్పెషల్ ప్యాకేజ్ విషయంలో బీజేపీ సర్కార్ ఏపీకి మొండి చేయి చూపిస్తుంది.నిన్చులు ఇచ్చేందుకు మొక్కు చూపించడం లేదు.
ఏపీలో పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ, జగన్ ని ఆర్ధికంగా దెబ్బ తీసి ప్రజలలో వ్యతిరేకత పెరిగే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది.అయితే జగన్ కి ఈ విషయం తెలిసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్రాన్ని బ్రతిమాలుకోక తప్పని పరిస్థితి ఈ నేపధ్యంలోనే ఢిల్లీ బాట పట్టిన జగన్ అక్కడ ప్రధాని మోడీతో పటు మంత్రులు, ఉప రాష్ట్రపతిని కలిసి ఏపీకి సాయం అందించాలని విజ్ఞప్తి చేసారు.
మరి ఈ విజ్ఞప్తిని బీజేపీ పార్టీ ఎంత వరకు మన్నిస్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి.