ప్రభాస్ కెరియర్ లో బాహుబలి తర్వాత మరో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సాహో.హాలీవుడ్ స్టాండర్డ్స్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల ఆఖరున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి సినిమాలు మీద అంచనాలు పెంచేశాయి.ఇక ఈ సినిమాలో పాత్రలని పరిచయం చేస్తున్న చిత్ర యూనిట్ రోజుకొక్క క్యారెక్టర్ ని పరిచయం చేస్తుంది.
సినిమాలో మెయిన్ విలన్స్ గా ఉన్నవారిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది.వీరి లుక్స్ కూడా సినిమా మీద ఇంటెన్సన్ పెంచుతుంది.
ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించి మరో కీలక ఘట్టానికి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.ఈ నెల 10న చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా ప్రమోషన్ విషయంలో ప్రభాస్ మరింత స్పీడ్ పెంచనున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే ఇప్పటికే వరకు హీరోయిన్ శ్రద్ధా కపూర్ సినిమా ప్రమోషన్ మీద ద్రుష్టి పెట్టలేదు.
పది తర్వాత ఆమె కూడా ప్రమోషన్ లో భాగం కానున్నట్లు తెలుస్తుంది.భారీ బడ్జెట్ సినిమా కావడం సౌత్ భాషలతో పాటు, హిందీలో కూడా రిలీజ్ కాబోతు ఉండటంతో సినిమా ప్రమోషన్ అన్ని రాష్ట్రాలలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.