టాలీవుడ్ లో ఇప్పుడు బిగ్ బాస్ రచ్చ ఒక రేంజ్ లో ఉంది.తనని బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఫైనల్ చేసి ఎంపిక చేయకపోవడం ఇగో హార్ట్ అయ్యి విపరీతమైన కోపంతో యాంకర్ శ్వేతారెడ్డి ఏపీ, తెలంగాణా చుట్టేసి తనకి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
విద్యార్ధులు, మహిళా సంఘాల మద్దతుతో ఎలా అయిన బిగ్ బాస్ మీద ప్రతీకారం తీర్చుకొని ఆ షోని ఆపించేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది.ఇప్పటికే ఈ ఇష్యూమీద ఓయూ విద్యార్ధులతో కలిసి రోడ్డెక్కిన శ్వేతారెడ్డి అవకాశం వచ్చిన ప్రతి సారి రచ్చ చేస్తుంది.
మరల తాజాగా మీడియా ముందుకి వచ్చి మరో సారి బిగ్ బాస్ షోని అడ్డుపెట్టుకొని కింగ్ నాగార్జున మీద విపరీతమైన వాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ కారణంగా మాకు ఇంత అన్యాయం జరిగితే నాగార్జున కనీసం పట్టించుకోకపోవడం దారుణమని అన్న శ్వేతారెడ్డి అతనికి సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నించింది.
అమల జంతువుల కోసం స్పందిస్తున్నప్పుడు ఇంత మంది అమ్మాయిలు ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు.బిగ్ బాస్ లో టాస్క్ల పేరిట కంటెస్టెంట్లను మానసికంగా హింసిస్తున్నారు.అమల, సమంతను దమ్ముంటే బిగ్బాస్షోకు పంపించండి.మన్మథుడు2 ప్రమోషన్స్కు చూపిస్తున్న శ్రద్ధ కూడా మా మీద చూపించకపోవడం దారుణమని వాఖ్యలు చేసింది.మా ఉద్యమాన్ని నీటి బుడగ అనడం దారుణం.త్వరలో ఓయూ విద్యార్ధులతో కలిసి బిగ్బాస్ హౌస్ను ముట్టడిస్తాం.అని విమర్శించి తరువాత ఏకంగా బూతులు మొదలెట్టింది.ఇష్టారాజ్యంగా బూతులతో నాగార్జున మీద రెచ్చిపోయింది.
ఇప్పుడు ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.అయితే ఈ ఇష్యూ మీద నాగార్జున స్పందించి కేసు వేస్తే అది మరింత రచ్చ అయ్యి తన ఉద్యమానికి బలం పెరుగుతుందని యాంకరమ్మ ఇలా బూతుల దండకం ఎత్తుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.