సునామి వస్తే దేశం దేశమే కొట్టుకు పోతుంది అని అంటారు.అలాంటి సునామీ ల గురించి మీరు వినేవుంటారు.
కానీ నార్తర్న్ చైనా లో మాత్రం వింతైన సునామీ వచ్చింది.ఇంతకీ ఆ సునామీ లో వింత ఏంటి అని అనుకుంటున్నారా.
ఏమీ లేదండి ఒక వాటర్ పార్క్ లో ఈ ఆశ్చర్యకరమైన సునామీ వచ్చి పలకరించింది.అసలు విషయం ఏమిటంటే, నార్తర్న్ చైనా లో షువాన్ పేరిట గల ఒక వాటర్ పార్క్ ఉంది.
అయితే అందరూ సరదాగా జలకాలాడుతున్న సమయంలో ఒక్కసారిగా సునామీ టైపులో నీళ్లు జలపాతంలా ఉబికి జనల మీదకు దూసుకు వచ్చాయి.దీనితో పిల్లలు,పెద్దలు అందరూ కూడా భయంతో వాటర్ పార్క్ లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాటకూడా చోటుచేసుకోవడం తో 40 మంది గాయపడినట్లు తెలుస్తుంది.అయితే విషయం ఆరా తీస్తే అప్పుడు అర్ధం అయ్యింది ఏంటంటే వాటర్ పార్క్ లోని వేవ్ మెషిన్ పని చేయకపోవడంతో.
ఇలా కృత్రిమ సునామీ ముంచెత్తిందట.తొలుత వేవ్ మెషిన్ నిర్వహిస్తున్న వ్యక్తి మద్యం తాగి ఉండడం తో ఈ ఘటన చోటుచేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ తరువాత అది నిజం కాదని మిషన్ పని చేయకపోవడమే కారణం అంటూ తేలింది.
ఈ ఘటనలో పూల్ నుంచి బయట పడిన ఓ మహిళ కాళ్లకు ,మాత్రం తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది.
గత ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మరోపక్క ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందడం తో ప్రస్తుతం ఆ వాటర్ పార్క్ ను మూసివేయించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది.