టాలీవుడ్ లో నిర్మాతల కష్టాలు కొన్నిసార్లు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి.ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా సినిమా ప్లాప్ అయితే నిండా మునిగేది నిర్మాత ఒక్కడే.
అయితే ముందు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఒక విషయంలో నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు.రెమ్యునరేషన్ వద్దంటూ కొత్తగా ఆలోచిస్తున్నారు.
ప్రతి స్టార్ హీరోకి ఒక్కో ఏరియాలో ఒక్కో మార్కెట్ ఉంది.అయితే పట్టున్న ఏరియాల హక్కులను పలువురు స్టార్ హీరోల రెమ్యునరేషన్ యాంగిల్ దక్కించుకుంటున్నారు.మహేష్ బాబు ఇదే తరహాలో బిజినెస్ చేసుకుంటుంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.మరో టాక్ ప్రకారం నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కావాలని కూడా స్టైలిష్ స్టార్ డిమాండ్ చేస్తున్నాడట.
ఐకాన్ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజుతో ఇప్పటికే పలుమార్లు ఈ డీల్ గురించి అల్లు అర్జున్ చర్చించడట.
అలా చేస్తే బయ్యర్ల నుంచి వచ్చే షేర్స్ తోనే కాలం గడపాలి.
రిస్క్ చేసి అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నాన్ థియేట్రికల్ రైట్స్ పెట్టుబడికి కాస్త ప్రాణం పోస్తుంది.ఒకవేళ సినిమా పోయినా తరువాత బయ్యర్లని ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఉంటాయి కాబట్టి దిల్ రాజు ఈ డీల్ ను అంతగా ఇష్టపడటం లేదట.అందుకే వారి మధ్య విబేధాలు పెరుగుతున్నట్లు టాక్ వస్తోంది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని పలువురు స్టార్ హీరోలు మాత్రం ఈ తరహాలో డీల్స్ సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.