ఎమ్మెల్యే ల నివాస భవన లిఫ్ట్ లో ప్రమాదం,ముగ్గురు టెక్నీషియన్స్ మృతి

ఏపీ రాజధాని అమరావతి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో ఉన్న లిఫ్ట్ ప్రమాదానికి గురి అవ్వడం తో ముగ్గురు టెక్నీషియన్స్ దుర్మరణం పొందినట్లు తెలుస్తుంది.

 Three Technicians Dead In Lift Accident In A P Amaravati-TeluguStop.com

తుళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాల దగ్గర లిఫ్టులో ని ఐదో అంతస్తు లో పని చేస్తుండగా, ఉన్నట్టుండి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది.దీనితో లిఫ్ట్ లో పని చేస్తున్న టెక్నీషియన్స్ కు తీవ్ర గాయాలు కావడం తో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ ఆ ముగ్గురూ మృతి చెందినట్లు తెలుస్తుంది.మృతులు అంతా కూడా బీహార్ కు చెందినవారుగా అధికారులు తెలిపారు.

రాహుల్ కుమార్, సురేంద్ర, కృపాల్ లు మృతులుగా గుర్తించారు.అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు కారణం ఏంటి అన్న దానిపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ లో జగన్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి చిన్న చిన్న మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే లిఫ్ట్ లో సమస్య తలెత్తడం తో టెక్నీషియన్స్ అక్కడకు చేరుకొని లిఫ్ట్ ని రిపేర్ చేస్తున్న సమయంలో ఇలా ప్రమాదానికి గురవ్వడం తో ఆ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube