ప్రపంచంలో తల్లి ప్రేమని మించింది మరేది లేదని అందరూ అంటూ ఉంటారు.పుట్టిన బిడ్డ ఎలా ఉన్న ఎలాంటి ఆలోచన లేకుండా నిస్వార్ధంగా ప్రేమించే వ్యక్తి తల్లి.
అందుకే తల్లిని ప్రతి ఒక్కరు పూజించాలి, గౌరవించాలి అంటారు.అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు అమ్మ అనే పదానికి అర్ధం తీసేస్తున్నారు.
తొమ్మిది నెలలు కడుపున ఉండి వచ్చిన బిడ్డలా మీద కూడా కనికరం లేకుండా వారి రాక్షసత్వం చూపిస్తున్నారు.పేగు బంధాన్ని మరిచిపోయి పైశాచికంగా ప్రవర్హిస్తున్నారు.
తాజాగా ఓ ఎన్నారై మహిళా కూడా ఎలాంటి నిర్వాకంతో ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తుంది.
ఓ ఎన్నారై మహిళా తొమ్మిది నెలలు నిండకుండానే ఓ ఆడ బిడ్డకి జన్మనిచ్చింది.
ఈ కారణంగా మొదటి మూడు నెలలు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది.హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత బిడ్డ మీద ప్రేమకి బదులుగా ఆ మహిళ ద్వేషం పెంచుకుంది.
పాప ఎద్చినప్పుడు ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టేది.ఆమె చిత్రహింసలను నాలుగు నెలలపాటు తట్టుకున్న షగుణ్.
ఓ రోజు స్పృహకోల్పోయింది.తనపై అనుమానం రాకుండా ఉండేందుకు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ అసలు విషయం బయట పడింది.
ఆ పాప పుర్రె కనీసం నాలుగు చోట్ల పగిలిందని, అంతేకాక మానిపోయిన గాయాలు కూడా పాప శరీరంపై చాలా ఉన్నాయని వైద్యులు తేల్చారు.ఆ పాప ఏడు నెలల తర్వాత ప్రాణాలు వదిలింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తల్లిని అదుపులోకి తీసుకున్నారు.తరువాత కోర్ట్ ముందు హాజరుపరచగా ఆమె ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించింది.
దీంతో కోర్టు ఆమెకి ఆరేళ్ళు జైలు శిక్ష విధించింది.