మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేసేసాడు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
అలాగే మరో వైపు సినిమాలో సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి.వాటిలో త్వరలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు దాటినట్లు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం బయటకి వచ్చింది.గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన టాక్ బయటకి వచ్చింది.ఇందులో చిరంజీవి మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కథ హాకీ నేపధ్యంలో ఉంటుందని, ఇందులో చిరంజీవి అవమానాలు ఎదుర్కొని ఇండియన్ విమెన్ టీంకి హాకీ కోచ్ గా మారి ఎలా గెలుపు బాటలో నడిపించాడు అనే కోణంలో ఉంటుంది అని తెలుస్తుంది.ఇక ఇందులో ఐశ్వర్య రాయ్ కూడా కీలక పాత్ర చేయడం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.
అలాగే ఇందులో అనసూయ హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కూడా కొరటాల తన స్టైల్ లో సందేశం జోడించి స్క్రీన్ ప్లే రాసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే స్రి సప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ లో అధికారికంగా వినిపిస్తున్న టాక్
.