జాలీ గా క్రికెట్ ఆడిన కర్ణాటక మాజీ సీఎం

ఒకపక్క కర్ణాటక లో రాజకీయ సంక్షోభం తలెత్తడం తో సంకీర్ణ ప్రభుత్వం తలమునకలు అవుతుండగా బీజేపీ నేతలు మాత్రం జాలీ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూన్నారు.గత కొద్దీ రోజులుగా కర్ణాటక లో రాజకీయ పరిణామాలు రోజుకొక మలుపు తిరగడం తో ఎప్పడు ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంటుంది.

 Karntaka Cm Bs Yeddyurappa Plays Cricket With Party Legislators1-TeluguStop.com

ఐతే బీజేపీ నేతలు మాత్రం అక్కడ ఏర్పడిన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రభుతాన్ని ఏర్పాటు చేయాలని తమ పనుల్లో తాము ఉంటూ ఇలా మధ్య మధ్యలో ఆట లు ఆడుతూ సేద తీరుతున్నారు.కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.

ఈ నెల 18న కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ కు సిద్దమైన సంగతి తెలిసిందే.అయితే ఒక్క చిన్న అవకాశం దొరికినా సంకీర్ణ ప్రభుత్వాన్ని తోసేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ చూస్తుంది.

మరోపక్క సుప్రీం కోర్టు కూడా ఈ రోజు రెబల్ ఎమ్మెల్యేల కేసును విచారించిన సుప్రీంకోర్టు రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్ దే అంటూ స్పష్టం చేయడం తో ఇప్పుడు ఇది కష్టాల్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అవ్వనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

-Telugu Political News

ఎందుకంటే ఇప్పటివరకు కూడా స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించని నేపథ్యంలో బలనిరూపణ సమయంలో అధికారం లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలాంశం కానుంది.అయితే మరోపక్క బీజేపీ కూడా తన స్కెచ్ లతో రెడీ గా ఉంది.ఈ తరుణంలో యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడుతూ ఫోటోలలో దొరికారు.

బెంగళూరులోని రమదా హోటల్ ప్రాంగంణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడిన యడ్యూరప్ప ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube