రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా ఆ వృద్ధ ప్రయాణికుడు ఏమిచేశాడంటే

ముంబై రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.అందరూ చూస్తుండగానే వృద్ధ ప్రయాణికుడు ఎదురుగా రైలు వస్తున్న నేపథ్యంలో పట్టాలపై పడుకొని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.

 Brave Cops Jump On Tracks To Save Elderly Mans Life In Mumbai Telugustop-TeluguStop.com

కారణాలు ఏంటి అనేది తెలియదు కానీ రద్దీ గా ఉన్న ముంబై రైల్వే స్టేషన్ లో వృద్ధ ప్రయాణికుడు ఉన్నట్టుండి ప్లాట్ ఫామ్ నుంచి ట్రాక్స్ పైకి దిగి నేరుగా పట్టాలపై పడుకున్నాడు.దీనితో అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు అందరూ అరుస్తున్నప్పటికీ ఆ వృద్ధుడు ఏమాత్రం పట్టించుకోకుండా పట్టాలపై పడుకున్నాడు.

అయితే ఇదంతా గమనించిన రైల్వే పోలీసులు హుటాహుటిన అక్కడకి చేరుకొని ఆ వృద్ధుడిని ఆ పట్టాలపై నుంచి పక్కకు లాగి అతడి ప్రాణాలను కాపాడారు.

రైల్వే స్టేషన్ లో అందరూ చూస్త�

అసలు ఎందుకు ఆ వృద్ధుడు ఇలాంటి సాహసానికి పాల్పడ్డాడు, ఏదైనా సమస్యల కారణంగా ఈ విధంగా చేశాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయం మాత్రం తెలియడం లేదు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ఈ ఘటన అంతా కూడా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube