అమెరికాలో స్థిరపడిన ఎన్నారై , ప్రముఖ సైక్లిస్ట్ కయ్యలమూడి శ్రీ రామమూర్తి.కారు ప్రమాదానికి గురయ్యారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు వాషింగ్టన్ లోని పావోలి ఆసుపత్రి కి తరలించారు.ఈ ప్రమాదంలో ఆయన మెదడుకి ,వెన్నెముకకి బలమైన గాయాలు అయ్యాయని ప్రస్తుతం ఆయన పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
శ్రీ రామమూర్తి సహజంగా సమాజ సేవకుడుగా అమెరికాలో అక్కడి తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా క్షణాలలో పరిష్కరించే వారిగా అందరికి తెలిసిన వ్యక్తే.అంతేకాదు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి అనేక సంస్థలకి డబ్బుని విరాళాలుగా ఇచ్చేవారు.
ఎన్నో సేవా కార్యక్రమాలలో శ్రీ రామమూర్తి లేకుండా ఉండవంటే అతిసయోక్తి కాదు.సమాజ హితం కోసం అందరికి ఆరోగ్యం అవసరం అనే శ్రీ రామ్మూర్తి అందరూ జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయాలని ప్రోత్సహిస్తూ ఉండేవారు.
అందరికి ఆదర్శవంతంగా ఉండే ఆయన ఇప్పుడు ప్రమాదానికి లోనయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉండటం అందరిని కలిచి వేస్తోంది.ఆయన్ని అభిమానించే ఎంతో మంది ఆయన త్వరగా కోల్కొవాలణి ప్రార్ధిస్తున్నారు.
వైద్య చికిత్సల కోసం ఎన్నారై ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.ఆయన చికిత్స కి ఎవరైనా ఫండ్ ఇవ్వలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేసి డొనేట్ చేయవచ్చు.
.