పాపం బాహుబలి తరువాత దర్శకుడు రాజమౌళి చేస్తున్న చిత్రం, అలానే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు ఎన్ఠీఆర్ లు కలిసి చేస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకులు ప్రతిఒక్కరూ కూడా ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.అయితే మూహూర్త బలమో మరేదైనా కారణమో తెలియదు కానీ ఈ చిత్ర షూటింగ్ తోలి నుంచి కూడా బ్రేక్ లతో కొనసాగుతుంది.
తొలుత ఈ చిత్ర తొలిదశ షూటింగ్ లో చెర్రీ గాయపడడం ఆయన కోలుకున్నాడు అనుకున్నాక మళ్లీ ఎన్ఠీఆర్ గాయపడడం ఇలా కొద్దీ రోజులు ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది.వారిద్దరూ సెట్ అయ్యారు లే అని అనుకుంటే ఈ చిత్ర హీరోయిన్ ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ గాయం పాలు కావడం తో మరోసారి బ్రేక్ పడింది.
అయితే అంతా పక్కన పెట్టి ఈ చిత్ర షూటింగ్ ను మొత్తానికి మొదలు పెట్టారు అంటూ రెండు రోజుల క్రితం వార్తలు గుప్పుమన్నాయో లేదో మళ్లీ మరోసారి ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.అయితే ఈసారి దర్సకుడు రాజమౌళి వంతు వచ్చింది.
ఏదో పర్సనల్ పని మీద జక్కన్న అమెరికా వెళ్లాల్సి ఉండటంతో వారంపాటు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు.
ఇకపోతే దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, చెర్రీ అల్లూరి సీతారామరాజు గా,ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు.మొదటిసారి నందమూరి,మెగా ఫ్యామిలీ కి చెందిన ఈ తరం హీరోలు నటిస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి.అందుకే ఎప్పుడు ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పెద్ద స్క్రీన్స్ లో దర్శనమిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.