దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా ఇండస్ట్రీ టాప్ చిత్రాలుగా పేరు దక్కించుకున్నాయి.కొరటాల మిర్చి చిత్రం నుండి గత ఏడాది వచ్చిన ‘భరత్ అనే నేను’ వరకు అన్ని కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి.
దాంతో ఈయన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు క్యూ కట్టే పరిస్థితి ఉంది.కాని దర్శకుడు కొరటాల మాత్రం తన తర్వాత సినిమాను చిరంజీవితో చేయాలని గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి ఈయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.కాని సినిమా ప్రారంభించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.మొన్నటి వరకు సైరా చిత్రం కోసం అంటూ కొరటాలను వెయిట్ చేయించిన మెస్టార్ చిరంజీవి ఇప్పుడు కాస్త విశ్రాంతి కావాలంటూ కొరటాలతో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలో చిరు 152వ చిత్రం ప్రారంభం కావడం లేదని, ముందుగా అనుకున్న ప్రకారం అయితే ప్రారంభం అవ్వాల్సి ఉంది.
కాని చిరు అనారోగ్య కారణాల వల్ల ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం కోసం దాదాపు సంవత్సరం పాటు చాలా కష్టపడ్డాడు.
యుద్ద సన్నివేశాలు మరియు ఇంకా కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి పాల్గొని చాలా అలసి పోయాడు.అందుకే విశ్రాంతి కావాలని భావిస్తున్నాడట.
విశ్రాంతి కోసం త్వరలోనే చిరంజీవి విదేశీయానం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.అదే నిజమైతే కొరటాల మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.
ఇప్పటికే సంవత్సరం దాటి పోయింది.సినిమా విడుదల అయ్యేందుకు మరో ఏడాది పడుతుంది.
అంటే భరత్ అనే నేను చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ కొరటాలకు రానుంది.చిరంజీవి మరీ కొరటాల ఓపికకు పరీక్ష పెడుతున్నట్లుగా అనిపిస్తుందని సినీ వర్గాల వారు సైతం అంటున్నారు.
మరి కొరటాల ఇంకా ఓపికగానే ఉంటాడా చూడాలి.అక్టోబర్లో సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.