అభిమానానికి వయసుతో సంబంధం లేదని ఒక భామ్మ నిరూపించింది.యువతకు ఏ మాత్రం తీసిపోకుండా కేరింతలు కొడుతూ భూర ఊదుతూ తనదైన శైలిలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.
టీమిండియాకు మద్దతు పలుకుతూ అందరిని ఆకర్షించిన 87 ఏళ్ల ఆ వృద్ధురాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫెమస్ అయ్యారు.
మంగళవారం జరిగిన బాంగ్లాదేశ్ – ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో కెమెరాలు చారులత పటేల్ అనే మహిళపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి.మ్యాచ్ ఎండింగ్ వరకు అభిమానులతో పోటీగా జట్టును ఉత్తేజపర్చడంలో తనవంతు పాత్ర పోషించింది.అయితే ఆమెను మ్యాచ్ అనంతరం విరాట్ స్పెషల్ గా కలుసుకున్నాడు.
ఆమె అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వాదం తీసుకొని తరువాతి మ్యాచ్ కి సన్నద్ధమవుతామని తెలిపాడు.రోహిత్ శర్మ కూడా ఆ సీనియర్ అభిమానిని కలుసుకొని కాసేపు ముచ్చటించాడు.ప్లేయర్స్ అంతా తన పిల్లలాంటి వారు అంటూ తాను చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తున్నట్లు చారులత తెలిపారు.1983 వరల్డ్ కప్ భారత్ గెలిచినప్పుడు కూడా తాను గ్రౌండ్ లోనే ఉన్నట్లు ఆమె వివరించారు.