దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీపైన భారీ కసరత్తు చేస్తున్నాడు.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ కి ఇప్పటికే మొదలెట్టిన జక్కన్న మధ్యలో కొన్ని అవాంతరాల మధ్య ఆపేసాడు.ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆ దెబ్బ తగ్గేంత వరకు మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదని అందరూ అనుకుంటున్నారు.
ఇక ఇందులో తారక్ భారీకాయుడుగా కనిపించడానికి ఫుల్ గా కసరత్తులు చేస్తున్నాడు.అల్లూరి, కొమరం భీం స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటె రాజమౌళి ఈ మల్టీస్టారర్ షూటింగ్ సైలెంట్గా పూర్తి చేసేస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించబోతున్నరని తెలుస్తుంది.
ఈ సినిమాలో తారక్-చరణ్ పాత్రల పరిచయ గీతాన్ని మూడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ గీతాన్ని చిత్రీకరించడానికి జక్కన్న సిద్ధమయ్యాడని టాలీవుడ్ లో వినిపిస్తుంది.
ఇక ఈ సాంగ్ భారీ ఎత్తున, భారీ ఏకంగా వెయ్యికి పైగా జూనియర్ ఆర్టిస్ట్స్ తో చిత్రీకరించేందుకు జక్కన్న ప్లాన్ చేసుకున్నాడు.ఇప్పుడు దీనికి సంబందించిన కసరత్తు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.