టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి ఒక ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి రాధిక.చిరంజీవి,చంద్రమోహన్,మోహన్ బాబు లు ఇలా ఆ తరం నటులతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన రాధిక కు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినట్లు తెలుస్తుంది.
ఆమె తో పాటు ఆమె భర్త శరత్ కుమార్ లకు కూడా చెన్నై లోని సైదాపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.శరత్ కుమార్, రాధికలు మలయాళం నిర్మాత లిస్టిన్ స్టీవెన్స్ తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్ బ్యానర్ పైన అనేక సినిమాలు చేశారు.అయితే ఇందులో భాగంగా రాధిక శరత్ కుమార్ లు రాడాన్స్ మీడియా సంస్థ నుంచి రూ.2 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే అప్పు తీర్చే క్రమంలో సదరు మీడియా సంస్థకు రాధిక చెక్ ఇచ్చారు.
అయితే ఆ చెక్ బౌన్స్ కావడం తో రాడాన్ మీడియా సంస్థ సైదాపేట లోని కోర్టులో కేసును దాఖలు చేసింది.అయితే ఈ కేసు విచారణ నేపథ్యంలో వారు కోర్టు కు హాజరు కాకపోవడం తో కోర్టు ఈ రోజు వారికి అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.అంతేకాకుండా ఈ కేసు తీర్పను జులై 12 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
మరి దీనిపై రాధిక శరత్ కుమార్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.