డబ్బు ఎంతటి ఘోరానికైనా వడిగట్టేలా చేస్తుంది.ఇది అందరికి తెలిసిందే.
తాజాగా అమెరికాలో జరిగిన ఘటన ఈ నానుడికి నిర్వచనాన్ని ఇచ్చింది.ముక్కూ మొఖం తెలియని ఓ వ్యక్తి ఆన్లైన్ పరిచయంతో, అతడు ఇస్తానన్న కోట్లాది రూపాయల ఆసతో, ఓ మహిళ మానసిక వికలాంగురాలైన తన ప్రాణ స్నేహితురాలినే చంపేసింది.
ఈ ఘటన అందరిని కలిచి వేసింది.వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని అలస్కాలో డెనాలీ బ్రెహ్మెర్ అనే అమ్మాయికి ఆన్లైన్ లో డారిన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.ఎవరినైనా చంపి ఆ ఫోటోలు తనకి పంపితే ఆమెకి 56 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడంతో ముందు వెనుకా ఆలోచన చేయకుండా తనకి ఎంతో ప్రాణ స్నేహితురాలైన మానసిక వికలాంగురాలు సింధియా ని చంపాలని నిర్ణయించుకుంది.మరో నలుగురు స్నేహితులతో ఆమె హత్యకి ప్లాన్ వేసింది.
ఈ క్రమంలోనే సింధియాని హైకింగ్ కి తీసుకువెళ్తున్నామని చెప్పి కారులు తీసుకువెళ్ళిన ఆమె, ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారుని ఆపి ఆమె సింధియా కాళ్ళు చేతులు కట్టేసి అతడికి ఫోన్ ద్వారా ఫోటోలు పంపి, తుపాకి తో తలపై గురి పెట్టి కాల్చేశారు.దాంతో అక్కడికక్కడే మృతి చెందిన ఆమె ఫోటోలు కూడా అతడికి పంపారు.ఆ తరువాత డబ్బు కోసం అతడికి ఫోన్ చేయగా తన వద్ద అంత డబ్బు లేదని చేతులు ఎత్తేశాడు, దాంతో తాము మోసపోయామని తెలుసుకుని అందోళన చెందారు.
తాజా వార్తలు