ఉత్తరాఖండ్ లో అవులీ లో జూన్ 18 నుంచి 22 వరకు అత్యంత వైభవంగా వివాహ వేడుకలు జరగనున్నాయి.ఈ వేడుకల కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
కేవలం పెళ్లి మండపం డెకరేషన్ కోసం 5 కోట్లు ఖర్చుపెడుతున్నారు.ఇదంతా తన ఇద్దరు కుమారుల వివాహం కోసం ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఖర్చుపెడుతున్న సొమ్ము అని తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.
వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాలో సెటిలైన ప్రవాస భారతీయుడు గుప్త తన ఇద్దరి కుమారుల వివాహాన్ని చేయడానికి సంబంధాలు చూసాడు.పెద్ద కుమారుడు వివాహం ఢిల్లీకి చెందిన సింఘాల్ కుటుంబానికి చెందిన యువతితో, అలాగే రెండో కుమారుడు వివాహం దుబాయ్ కి చెందిన జూలాన్ కుటుంబానికి చెందిన యువతితో జరగనుంది.
ఈ పెళ్లి వేడుక ముందుగా ఇటలీలో చేయాలని అనుకున్నాడు.అయితే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రం సింగ్ రావత్ అభ్యర్ధన మేరకు మేరకు గుప్త ఉత్తరాఖండ్ లో అవులీ లో చేయాలని నిర్ణయించుకున్నాడు.
దీనికి భారీగా ఏర్పాట్లు చేసాడు.ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారని తెలుస్తుంది.
ఈ వేడుకల కోసం గుప్తా ఏకంగా 150 హెలికాప్టర్లను పెళ్ళికి హాజరయ్యే వారి సౌకర్యార్ధం ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇక ఈ పెళ్లి ఖర్చు ఖరీదు ఏకంగా 200 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
ఇండియాలో ఓ ప్రవాస భారతీయుడు ఇంత ఖరీదైన పెళ్లి వేడుకలు నిర్వహించడం ఇదే ప్రథమం అని చెప్పాలి.