టాలీవుడ్ లో ప్రస్తుతం వారసుల తెరంగేట్రం మొదలవుతుంది.ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎనిమిది మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి తమదైన గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘంష్ శ్రీహరి హీరోగా రాజ్ దూత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని ఏం ఎల్ వి సత్యనారాయణ నిర్మించారు.ఇక మేఘంష్ నెక్స్ట్ సినిమా కూడా తానే నిర్మిస్తా అని ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇక మేఘంష్ శ్రీహరి నెక్స్ట్ సినిమాలో అతనికి జోడీగా రాజశేఖర్ కూతురు శివాని నటిస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు ఈ నెక్స్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే శివాని అడవి శేష్ తో కలిసి 2 స్టేట్స్ అనే సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందని.ఈ సినిమాని కూడా ఏం ఎల్ వి సత్యనారాయణ నిర్మించారు.
ఇక 2 స్టేట్స్ సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవుతుందో తెలియదు.కాని ఇంతలో శ్రీహరి కొడుకుతో శివాని రాజశేఖర్ హీరోయిన్ చేయబోతుంది అనే టాక్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది.
అయితే ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.