మరదళ్లతో సరదా సయ్యాట కాస్తా ముగ్గురు ప్రాణం తీసిందని... జనగామలో దారుణం

మరదళ్ళు ఇద్దరు భావతో సరదాగా నీటిలో ఆడుకుంటున్నారు.వాళ్ళ అక్క ఒడ్డున ఉండి తన భర్త, చెల్లెళ్ళ సరదాలని వీడియో తీస్తూ ఉంది.

 Selfie Turns Fatal As Three Drown In Jangaon-TeluguStop.com

ఇంతలో ఊహించని విధంగా ముగ్గురు జలాశయంలో జారి పడిపోయి ఆమె కళ్ళముందే మునిగి ప్రాణాలు వదిలారు.ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలో జనగామ జనగామ జిల్లాలో వెలుగుచూసింది.

జనగామ జిల్లాలోని రఘునాథ్‌పల్లి మండలంలోని మేకలగుట్ట సమీపంలోని బండతాండకు చెందిన అవినాశ్‌, అతని భార్య భార్గవి, ఆమె ఇద్దరు చెల్లెళ్లు సుమలత, సంగీత కలిసి సరదాగా నర్మెట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు.

వాతావరణం చల్లగా ఉండటంతో ఇద్దరు మరదళ్లతో కలిసి అవినాష్ నీటిలో దిగాడు అతని భార్య భార్గవి చెల్లెళ్లతో భర్త సరదాలని వీడియో తీస్తుంది.

బావను సరసాలు ఆడుతున్న మరదళ్ళు అతనిని పైకి ఎత్తి నీటిలో పడేసారు.అయితే వారు పడేసిన చోటు లోతు ఎక్కువ ఉండటంతో ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అదుపు తప్పి జలాశయంలో పడిపోయారు.

రిజర్వాయర్‌ నీటిలో మునిగిన ముగ్గురు ఒక్కసారిగా గల్లంతు కావడంతో కంగారుపడిన అవినాష్ భార్య గట్టిగా కేకలు వేసింది.దాంతో స్థానికులు అక్కడికి చేరుకుని నీటిలో మునిగిన వారి కోసం గాలించారు.

అయితే అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.తన కళ్ల ముందే భర్తతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడం చూసిన భార్గవి షాక్ కి గురయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube