గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా సమర్దవంతంగా బాద్యతలు నిర్వహించి ప్రజల చేత విశేషంగా మన్ననలు అందుకున్న నాయకురాలు సుష్మా స్వరాజ్.ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉండి తనని ట్విట్టర్ ద్వారా సంప్రదించిన నేరుగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ బాధితులకి అండగా ఉంటూ వచ్చేది.
దీంతో సోషల్ మీడియాలో సుష్మా స్వరాజ్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.దానికి తగ్గట్లుగానే ఆమె అందరికి అందుబాటులో ఉంటూ, అందరి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసేది.
అయితే ఆమెకి ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి మంత్రి పదవి ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే ఆమెకి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సుష్మా స్వరాజ్ గా సపోర్ట్ గా చాలా మంది పోస్ట్ లు చేస్తున్నారు.ఆమె లాంటి గొప్ప వ్యక్తిని మంత్రివర్గంలలో చూడలేకపోవడం నిజంగా బాధాకరం అంటూ స్పందించారు.
ఇక తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి అంటూ కొందరు కామెంట్స్ చేసారు.ఇదిలా ఉంటే మరో వైపు రాజకీయ వర్గాల్లో కూడా సుష్మాని మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడంపై ప్రధాని మోడీ మీద విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఆమెకి ఈ సారి మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి కారణాలు ఎలా చెప్పాలి అని వెతికే పనిలో మోడీ అండ్ కో ఉందని టాక్ వినిపిస్తుంది.