పబ్జీ గేమ్ ని ఆడుతూ ఎన్ని అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయో అందరికీ తెలిసిందే.అయితే ఈ గేమ్ ని ఆడొద్దు అంటూ ఎంత మంది చెబుతున్నా ఈ తరం యువత మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలోనే ఈ పబ్జి గేమ్ కు 16 ఏళ్ల యువకుడు బలయ్యాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నీముచ్ ప్రాంతం లో చోటుచేసుకుంది.
ఆ ప్రాంతానికి చెందిన పూఖ్రాన్ ఖురేషి(16)అనే యువకుడు 12 వ తరగతి చదువుతున్నాడు.అయితే ఆ యువకుడు పబ్జీ గేమ్ కు బాగా అలవాటుపడడం తో ఎప్పుడూ కూడా దానిలోనే మునిగిపోయేవాడు.
ఈ క్రమంలోనే మే 26 న కూడా అతడు పబ్జీ గేమ్ ఆడాడు.అయితే మధ్యాహ్నం మొదలు పెట్టిన గేమ్ ని దాదాపు 6 గంటల పాటు ఆడుతూనే ఉన్నాడు.
దీనితో అతడి శరీరం తీవ్ర ఒత్తిడికి గురవ్వడం తో ఆ యువకుడి గుండె పై ప్రభావం పడింది.దీనితో ఫుఖ్రాన్ తీవ్ర ఒత్తిడికి గురై గుండె పోటు లాగా వచ్చి రాత్రి 7 గంటల సమయంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు.ఇటీవల ఎవరిని చూసినా ఈ పబ్జి గేమ్ లు ఆడుతూ ఎక్కడ బడితే అక్కడ యువత కనిపిస్తుంది.ఈ గేమ్ లు ఆడొద్దు అని దేశ వ్యాప్తంగా నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పలువురు సలహాలు ఇస్తున్నప్పటికీ యువత లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
ఈ పబ్జి గేమ్ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.అయినప్పటికీ యువత మాత్రం ఆ పబ్జి గేమ్ లోనే మునిగిపోతున్నారు.