మహేష్బాబు 25వ చిత్రం ‘మహర్షి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.మిశ్రమ స్పందన వచ్చినా కూడా వంద కోట్ల షేర్ను రాబట్టి అబ్బో అనిపించింది.
అద్బుతమైన రికార్డును సొంతం చేసుకున్న మహేష్బాబు ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఈ సమయంలోనే ఆయన 26వ చిత్రం ప్రారంభం అయ్యింది.
నేడు మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు.ఈ సందర్బంగా మహేష్ 26 సినిమా ప్రారంభం అయ్యింది.
ఇప్పటికే 26వ చిత్ర దర్శక నిర్మాతలు ఖరారు అయ్యారు.తాజాగా హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర, దిల్రాజులు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మిస్తుండగా, రష్మిక హీరోయిన్గా నటించబోతుంది.నేడు లాంచనంగా ప్రారంభం అయిన సినిమా పూజా కార్యక్రమాల్లో రష్మిక పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది.
గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిన రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్కు జోడీగా ఎంపిక కావడంతో ఆమె స్థాయి అమాంతం పెరిగి పోయింది.
ఇక ఈ చిత్రం ప్రారంభోత్సవం రోజే టైటిల్ను దర్శకుడు అనీల్ రావిపూడి ప్రకటించాడు.ఈ చిత్రంకు ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ టైటిల్ను ఖరారు చేసి ఫ్యాన్స్కు పండుగ తెచ్చాడు.నిజంగానే టాలీవుడ్లో మహేష్బాబుకు సరిలేరు మరెవ్వరు అంటూ ఫ్యాన్స్ గొప్పలు చెబుతున్నారు.
మహేష్బాబు క్రేజ్కు తగ్గట్లుగా, ఆయన ఇమేజ్కు తగ్గట్లుగా మంచి టైటిల్ను అనీల్ రావిపూడి పెట్టాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.టైటిల్ విషయంలో సక్సెస్ అయిన అనీల్ అప్పుడే సినిమాను సగం సక్సెస్ చేశాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ టైటిల్ ఫ్యాన్స్కు అమితానందంను కలిగిస్తుంది
.