అగ్రవర్ణాల దురంహకాం ఇప్పటికి చాలా రాష్ట్రాలలో కొనసాగుతూనే ఉంది.తక్కువ జాతి వారిని ఊరికి దూరంగా ఉంచడం, వారు ఏదైనా అగ్రవర్ణాల వారిని నచ్చని పని చేస్తే హింసించడం చేస్తూ ఉంటారు.
ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నార్త్ ఇండియాలో జరుగుతూ ఉంటాయి.ఒకప్పుడు ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కూడా ప్రజలలో వచ్చిన చైతన్యం కారణంగా అలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో జరగలేదు.
అయితే తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.రంగంపేట మండలం సింగంపల్లి స్థానిక మామిడి తోటలో మామిడికాయలు దొంగతనం చేశాడని గొల్లలమామిడాడకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన బక్కి శ్రీను అనే వ్యక్తిని ఏకంగా పంచాయితీ కార్యాలంలో హింసించి చంపేసి ఆత్మహత్య క్రింద క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.
గొల్లలమామిడాడకు చెందిన బక్కి శ్రీను తన భార్య, పిల్లలను అత్తారింటికి తీసుకువెళ్లి వారిని అక్కడ వదిలేసి తిరిగి వస్తున్న క్రమంలో సింగంపల్లిలో మామిడితోటలో మామిడి పండు కోసుకుని తిన్నాడు.ఇది చూసిన తోట కౌలుదారులు శ్రీనుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి అందులో నిర్భంధించి చిత్ర హింసలకి గురి చేసారు.
అయితే తెల్లారేసరికి అతని ఓరి వేసుకొని ఉండటం.అది కూడా మోకాలు అదే స్థాయిలో అతని శవం ఉండటంతో అతనిని హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
దీంతో ఎస్సీ వర్గానికి చెందిన అందరూ వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.పరిస్ధితులు అదుపు తప్పడంతో భారీగా పోలీసు బలగాలను రప్పించారు.దీనిపై కేసు నమోదు చేసి ఇప్పుడు విచారిస్తున్నారు.