ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి.ఈ సినిమాతో సౌత్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన సాయి పల్లవి లుక్ చాలా నేచురల్ గా ఉంటుంది.
రెగ్యులర్ హీరోయిన్స్ లా మేకప్ తో కాకుండా క్యాజువల్ లుక్స్ తో కనిపించే సాయి పల్లవికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం తన ఫేవరేట్ హీరో సూర్యకి జోడీగా ఈ భామ ఎన్జీకె సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో సాయి పల్లవి తన అందం గురించి ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది.ఫెయిర్ నెస్ క్రీం యాడ్స్ విషయంలో తనకి ఎంత మాత్రం ఆసక్తి లేదని చెప్పిన సాయి పల్లవి తన బ్యూటీ రహస్యం చెప్పింది.
నాకు తెలిసిన ప్రపంచం అమ్మానాన్న చెల్లి పూజ మాత్రమె ఉన్నారు.తను నాకంటే కేవలం ఐదేళ్లు చిన్నది.కానీ అద్దంలో నా పక్కన నిలుచుని చూసి అక్కంత అందంగా లేనే అని ఫీలవుతుంది.నాలా కనిపించడానికి పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తినడం మానేసి పళ్ళు కాయగూరలు తీసుకోవడం అలవాటు చేసుకుంది.
మనది దేవుడు ఇచ్చిన రంగు.దాన్ని క్రీములతో మార్చాలనుకోవడం సరికాదు.
ప్రేమమ్ లో నటించినప్పుడు మగాళ్లలా ఉండే నా గొంతు మొహం మీద మొటిమలని జనం ఎంత వరకు చూస్తారు అనే డౌట్ వచ్చినా కూడా నా లుక్ మాత్రం మార్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.