వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి.తమిళ సినిమా జిగార్తాండకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సాగుతుంది.
ఇందులో వరుణ్ పూర్తిస్థాయిలో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.ఇందులో వరుణ్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడానికి సిద్ధం అయ్యారు.
అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాటల బట్టి దేవిశ్రీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
ఓ సాంగ్ విసిఃయంలో దర్శకుడు హరీష్ శంకర్ తో వచ్చిన క్లాస్ కారణంగా సినిమా చేయడానికి దేవిశ్రీ ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది.దీంతో వాల్మీకి నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవడంతో అతని ప్లేస్ లో మిక్కీ జే మియర్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.