ఈ మధ్య కాలంలో ఏండ్రాయిడ్ ఫోన్ లు వాడకం పెరిగిపోయింది.ఈ ఫోన్లు వాడుతూ కనీసం మన చుట్టూ ఏమి జరుగుతుందో అన్న విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు.
ఆ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఒక వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.ఫోన్ ధ్యాస లో పడిన ఒక తండ్రి తన కొడుకుపైనే కారు పోనిచ్చిన విషయం విదితమే.
అయితే ఇప్పుడు తాజాగా థాయ్ లాండ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.తల్లి చాటింగ్ లో బిజీ గా ఉండడం తో ఎనిమిదేళ్ల పిల్లాడు రోడ్డుపైకి వెళ్లడం తో అటుగా వస్తున్న లారీ కింద పడ్డాడు.
దీనితో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళితే… ఆన్ లైన్ లో సోదరి తో చాట్ చేస్తుండగా ఎనిమిదేళ్ల పిల్లాడిని అడ్డుకోవడానికి వరండా లో వదిలిండి.
అయితే గేటు తీసి ఉన్న సంగతి చూసుకొని ఆ తల్లి అనంతరం కొద్దీ సేపటి తిరిగి బిడ్డ కోసం చూసుకోగా అప్పుడు అసలు విషయం తెలుసుకుంది.హడావుడిగా రోడ్డుపైకి వచ్చి చూడగా ఆ చిన్నారి లారీ టైరు కింద పది నుజ్జు నుజ్జయి కనిపించాడు.
చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.లారీ డ్రైవర్ను అరెస్టు చేశారు.సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా.ఇంటి గేటు తీసిన పిల్లాడు మెట్లపైనుంచి జారి రోడ్డుపై పడ్డాడని, అతన్ని తప్పించడానికి లారీ డ్రైవర్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని విచారణలో తేలింది.