ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే H1B వీసాలపై కఠిన నిబంధనలను ప్రవేశపెట్టి కొత్తగా అప్లై చేస్తున్న వారిని కష్టతరం చేసింది.ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రానున్న 2020 ఆర్ధిక సంవత్సరానికి సంబంధిచిన బడ్జెట్ ప్రణాళిక లో భాగంగా H1B వీసాల అప్లికేషన్ ఫీజు పెంచాలని భావిస్తోంది.2020 ఆర్ధిక సంవత్సరం 2019 అక్టోబర్ 1 నుంచి ప్రారంభము అవుతుంది.
H1B వీసాల అప్లికేషన్ ఫీజు పెంచటం భారతీయ కంపెనీలపై భారం పెరుగుతుంది.ఫీజులు చెల్లించిన వీసాలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉండటం వంటి వాటివలన H1B వీసాలు అప్లై చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది అని అంచనా.H1B వీసాల పై వచ్చిన ఆదాయాన్ని అమెరికన్ టెక్నాలజీ స్టూడెంట్స్ కి ఇచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కోసం అమెరికా ప్రభుత్వం ఉపయోగించనుంది.