తెలంగాణలోని మంచిర్యాలకి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి అమెరికాలోని బోస్టన్ లో చదువుకుంటున్నాడు.ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్ తో కలిసి దగ్గర లో ఉన్న బీచ్ కి వెళ్లారు.
ఫ్రెండ్స్ అందరు కలిసి స్విమ్మింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అల రావడంతో శ్రవణ్ అల నుంచి తప్పించుకోలేక మునిగిపోయాడు.అతని ఫ్రెండ్స్ అల ని తప్పించుకొని బయటకి వచ్చి శ్రవణ్ కోసం చూడగా అతను కనిపించకపోవడంతో అక్కడ ఉన్న కోస్ట్ గార్డ్స్ కి సమాచారం చెప్పారు.
కోస్ట్ గార్డ్స్ సముద్రం లో వెతగగా శ్రవణ్ మృతదేహం దొరికింది.
ఈ విషాదాన్ని శ్రవణ్ స్నేహితులు మంచిర్యాలలోని శ్రవణ్ తల్లితండ్రులకు తెలియచేసారు.చదువు కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ,శ్రవణ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.