ఏపీలో జరిగిన ముక్కోణపు ఎన్నికల పోటీలో గెలుపు ఎవరి పక్షాన ఉంది అనే డైలమా ప్రతి పార్టీలో ఉన్నా, అధికారం మాదంటే మాది అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు లెక్కలతో సహా చెబుతున్నాయి.కానీ ఓటరు తీర్పు మాత్రం తెలిసేది మే 23 వ తేదీనే.
టీడీపీ , వైసీపీ పార్టీలు జనసేన పార్టీ చీల్చే ఓట్ల మీదే లెక్కలు వేస్తున్నాయి.దానిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అవుతూ నియోజకవర్గాలవారీగా జనసేన ప్రభావం పై లోతుగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఆ పార్టీ కి పడే ఓట్లు కులమత ప్రాతిపదికన లెక్కకట్టినా జనసేన ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.
ఇక వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన తేదీ దగ్గర నుంచి విజయం మాదే అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది.
మహిళలు, వృద్ధులు పక్కాగా ఓటు వేశారన్న ఒక్క ధీమాతోనే టీడీపీ ఆశలు పెట్టుకుంది.అయినా మితిమీరిన విధంగా వైసీపీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుండడం తో కౌంటింగ్ లో ఏజెంట్లు గట్టిగా నిలబడే చర్యలను టీడీపీ అధిష్టానం చేపట్టింది.
దీనికోసమే పోటీ చేసిన అభ్యర్థుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి తమ వద్ద వున్న సమాచారంతో పోల్చి చూసి గెలుపు అంచనాను లెక్కగట్టే పని చేపట్టింది.
ఏపీలో జరిగిన ముక్కోణపు ఎన్నికల పోటీలో గెలుపు ఎవరి పక్షాన ఉంది అనే డైలమా ప్రతి పార్టీలో ఉన్నా, అధికారం మాదంటే మాది అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు లెక్కలతో సహా చెబుతున్నాయి.కానీ ఓటరు తీర్పు మాత్రం తెలిసేది మే 23 వ తేదీనే.టీడీపీ , వైసీపీ పార్టీలు జనసేన పార్టీ చీల్చే ఓట్ల మీదే లెక్కలు వేస్తున్నాయి.
దానిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అవుతూ నియోజకవర్గాలవారీగా జనసేన ప్రభావం పై లోతుగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఆ పార్టీ కి పడే ఓట్లు కులమత ప్రాతిపదికన లెక్కకట్టినా జనసేన ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.
ఇక వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన తేదీ దగ్గర నుంచి విజయం మాదే అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది.మహిళలు, వృద్ధులు పక్కాగా ఓటు వేశారన్న ఒక్క ధీమాతోనే టీడీపీ ఆశలు పెట్టుకుంది.అయినా మితిమీరిన విధంగా వైసీపీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుండడం తో కౌంటింగ్ లో ఏజెంట్లు గట్టిగా నిలబడే చర్యలను టీడీపీ అధిష్టానం చేపట్టింది.దీనికోసమే పోటీ చేసిన అభ్యర్థుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి తమ వద్ద వున్న సమాచారంతో పోల్చి చూసి గెలుపు అంచనాను లెక్కగట్టే పని చేపట్టింది.ముఖ్యంగా చెప్పుకుంటే కోస్తా ప్రాంతంలో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ముందునుంచి అన్ని పార్టీలు అంచనా వేస్తూనే వచ్చాయి.ఇప్పుడు ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం టీడీపీ మీద పడిందా, వైసీపీ మీద పడిందా అనేది తెలియక రెండు పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.
పైకి మాత్రం రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నా జనసేన చీలిక ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ అన్నది తేల్చుకోలేక సతమతమౌతున్నారు.ముక్కోణపు పోటీ ముమ్మరంగా జరిగిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది టిడిపి.
జనసేన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా తమ మద్దతు అవసరం అని , అప్పుడు చక్రం తిప్పేది తామేనని చెప్తూ మరింత రాజకీయ వేడి రగులుస్తోంది.ముఖ్యంగా చెప్పుకుంటే కోస్తా ప్రాంతంలో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ముందునుంచి అన్ని పార్టీలు అంచనా వేస్తూనే వచ్చాయి.
ఇప్పుడు ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం టీడీపీ మీద పడిందా, వైసీపీ మీద పడిందా అనేది తెలియక రెండు పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.పైకి మాత్రం రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నా జనసేన చీలిక ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ అన్నది తేల్చుకోలేక సతమతమౌతున్నారు.
ముక్కోణపు పోటీ ముమ్మరంగా జరిగిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది టిడిపి.జనసేన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా తమ మద్దతు అవసరం అని , అప్పుడు చక్రం తిప్పేది తామేనని చెప్తూ మరింత రాజకీయ వేడి రగులుస్తోంది.