ఓ తెలుగు ఎన్నారై విద్యార్ధి న్యూజిలాండ్ వర్సిటీలో యూఎస్బీ టెక్నాలజీ ద్వారా థంబ్ డ్రైవ్ ని ఉపయోగించి దాదాపు 59 కంప్యూటర్స్ ని ద్వంసం చేసిన ఘటన విషయం అందరికి తెలిసిందే.ఈ కేసుకు సంభందించి అతడికి దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష సుమారు 250,000డాలర్లు అంటే రూ.
కోటీ 73లక్షలు జరిమానా విధించారు.
ఆ విద్యార్ధి పేరు ఆకుతోట విశ్వనాథ్.
ఈ కేసుకు సంభందించి ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.న్యూజిలాండ్లో నివాసముంటున్న విశ్వనాథ్ అమెజాన్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా యూఎస్బీ కిల్లర్ని కొనుగోలు చేశాడు.
ఆ తరువాత ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తాను చదువుతున్న న్యూయార్క్ వర్సిటీకి చెందిన 59 కంప్యూటర్లను ధ్వంసం చేశాడు.
అయితే ఈ కంప్యూటర్స్ పని చేయకపోవడానికి గల కారణాలని గుర్తించిన వర్సిటీ కంప్యూటర్లు విశ్వనాథ్పై అనుమానం వ్యక్త పరిచి పోలీసులని సమాచారం అందించింది.
దాంతో కోర్టులో యూనివర్సిటీ తరుపున న్యాయవాది బలమైన వాదన వినిపించారు.పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఈ శిక్షని ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.