తెలుగు ఎన్నారైకి ఏ దేశం ఎగినా సరే అక్కడ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎర్పరుచుకుంటారు.తమ ప్రతిభతో తిరుగులేని వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు.
ఏ రంగంలో అడుగిడినా సరే తప్పకుండా విజయాన్ని చేజిక్కించుకుంటారు.ఇప్పుడు అటువంటి సంఘంటనే కెనడాలోని ఎన్నికల్లో జరిగింది.
తాజాగా కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగు ఎన్నారైలు గుంటూరు జిల్లా జాగర్లమూడికి చెందిన ప్రసాద్ పాండా , విజయనగరం కి చెందిన లీలా అహీర్ అనే ఇద్దరు తెలుగు ఎన్నారైలు యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ తరుపున బరిలో దిగి విజయ పతాకం ఎగురవేశారు.
అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీ కి ఎన్నికలు రావడం ఇది రెండో సారి.
ఈ నెల 16న అల్బెర్టా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.దాదాపు 87 స్థానాల అసెంబ్లీలో యూసీపీ 64 సీట్లు గెలిచి ఆధిఖ్యత కనబరిచింది.
దాంతో ఆ పార్టీ అధ్యక్షుడు జాసన్ కెన్నీ ముఖ్యమంత్రి కానున్నారని తెలుస్తోంది.