ఇండోనేషియా దేశం అంటే ఎప్పుడు ఏ సునామి వచ్చి విరుచుకుపడుతుందో, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియని పరిస్థితిలో ప్రజలు నిత్యం భయం గుప్పిట్లో బ్రతుకుంటూ ఉంటారు.ఎప్పటికప్పుడు భూకంపం ఇండోనేషియాని భయపెడుతూ ఉంటుంది.
గతంలో ఆ దేశంలో సంభవించిన భూకంపం, సునామీల కారణంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పుడు మరోసారి ఆ దేశాన్ని భూకంపం భయపెట్టింది.
ఇండోనేషియా దేశంలో సులవేసి ద్వీపంలో భారీ భూకంపం వచ్చింది.రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది.సులవేసి ద్వీపంలో భూకంపం రావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
భూకంపం సంభవించడంతో జరిగిన నష్టం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక ప్రాణ నష్టం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
.