కెజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.హీరోయిజం తో సినిమాని ఎంత అద్బుతంగా తెరపై ఆవిష్కరించవచ్చు అనే విషయాన్ని కెజీఎఫ్ సినిమా ద్వారా చేసి నిర్మాతల ఇంటెన్సన్ తనవైపు తిప్పుకున్నాడు.
ఇప్పుడు అతనితో కేవలం కన్నడ నిర్మాతలు మాత్రమె కాకుండా సౌత్ ఇండియాలో బడా నిర్మతలు అందరూ సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ లిస్టులో మొదటి వరుసలో తెలుగు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రశాంత్ నీల్ పైన ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
ప్రశాంత్ నీల్ దర్శకతంలో అయితే ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కించడం లేదంటే ఎవరైనా స్టార్ హీరోతో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కెజీఎఫ్ సీక్వెల్ మీద ద్రుష్టి పెట్టిన ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్ లో ఉంటుంది అనే టాక్ బలంగా వినిపిస్తుంది.