తెలంగాణకు చెందిన ఓ ఎన్నారై అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.అతని పేరు కాశీ విశ్వనాద్.
మూడేళ్ళ క్రితం అమెరికాలో ఉద్యోగ సంపాదించిన విశ్వనాథ్ షార్లెట్లో ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
బుధవారం ఉదయం 10 గంటల వరకు విశ్వనాథ్ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు అతడి గది తలుపులు పగులకొట్టి లొపలికి వెళ్లారు.
వారు చూసేసరికి అతడు అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు తెలిపి అతడిని ఆసుపత్రిలో చేర్చారు.
అప్పటికే విశ్వనాద్ మరణించాడని వైద్యులు స్నేహితులకి తెలిపారు.
అతడికి ఎటువంటి అనారోగ్య సమస్య లేదని వారు తెలిపారు.అయితే అతడి మృతిపై కుటుంభ సభ్యులు అనుమానాలు వ్యక్తపరిస్తున్నారు.
తమ కొడుకు మృతికి కారణం ఏమిటో తెలియాలని వారు పట్టుపడుతున్నారు.