ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అనే మాట ఎంత నిజమో సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్ధమవుతుంది.నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది.
మానవత్వం మరిచిపోయి కర్కసంగా ప్రవర్తించే మనుషులు అప్పుడప్పుడు సొంత కుటుంబాలలో కనిపిస్తూ ఉంటారు.తాజాగా కేరళలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వరకట్న వేధింపులు, ఆడవారిపై అత్తింటి వారి దారుణాలని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.
కట్నం తేలేదని ఇంటి కోడలినే అత్తింటివారి కడుపు మాడ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తుషార అనే మహిళకు అత్తింటివారు గత కొద్దిరోజులుగా భోజనం పెట్టకుండా నానబెట్టిన బియ్యం, చక్కెర నీటిని ఆహారంగా ఇచ్చేవారు.వాటిని తినలేక ఆకలిని భరించలేక ఆ మహిళ చివరకు చిక్కిశల్యమై ఎముకల గూడుగా మారిపోయింది.ఆమె పరిస్థితి సీరియస్ గా మారడంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.
ఆమె ఈనెల 21న అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందింది.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు.
పోలీసుల దర్యాప్తులో బాధితురాలుపై అత్తింటి వారి చేసిన హింస వెలుగులోకి వచ్చింది.ఆహారం లేకపోవడంతో ఆమె ఏకంగా 20 కిలోలకి బరువు తగ్గిపోయి పూర్తిగా ఎముకల గూడులా మారిపోయిందని పోలీసులు వెల్లడించారు.ఆమె చావుకి కారణమైన అత్త, భర్తపై హత్యానేరం క్రింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
.