ఏపీ రాజకీయాలో ప్రస్తుతం ఎం జరుగుతుంది అంటే అందరూ వైసీపీ వైపు ప్రజాప్రతినిధుల వలసలు ఎక్కువ అవుతున్నాయి అని.సర్వేలలో ఎక్కువగా వైసీపీ గెలిచే అవకాశం ఉందని తెలియజేయడంతో చాలా మంది నేతలు వైసీపీ కండువా కప్పుకోవడానికి ఎ మాత్రం వెనుకాడటం లేదు.
టీడీపీ పార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీ కండువా కప్పుకున్నారు.వారిలో అవంతి, పందుల రవీంద్రబాబు లాంటి నేతలతో పాటు, గత ఎన్నికలలో వైసీపీలో గెలిచి టీడీపీ అధికారంలోకి రాగానే పసుపు కండువా కప్పుకున్న నేతలందరూ మళ్ళీ జగన్ వైపు వెళ్తున్నారు.
ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తన పార్టీలోకి వచ్చిన వారిని వచ్చినట్లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్నారు.అసలు గతంలో తనని మోసం చేసిన వారిని కూడా జగన్ మళ్ళీ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాడు.ఇలా పార్టీలోకి చేరుతునన్న వారందరూ తన అధికారంలోకి వస్తానని తెలిసే వస్తున్నారని, ఇది వైసీపీ బలం అని జగన్ అండ్ కో భావిస్తున్నారు.ఇక రాజకీయాలకి దూరంగా ఉన్నవారిని కూడా పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి తీసుకుంటున్నారు.
ఎంత మంది నేతలు తన పార్టీలో చేరితే ప్రజాభిప్రాయం తనకి అంత అనుకూలంగా మారుతుంది అని జగన్ భావిస్తున్నారు.
అయితే ఇలా వైసీపీ పార్టీలో చేరుతున్న టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై నమ్మకంతో చేరుతున్నారా అంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, రాజనీతి తెలిసిన ఎవరైనా వైసీపీ టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల చేరిక వెనుక కచ్చితంగా వ్యూహాత్మక ఆలోచన ఉందని భావిస్తున్నారు.గతంలో తెలుగులో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తరహాలో తన వాళ్ళందరిని వైసీపీలోకి పంపించి, ఆ పార్టీ వ్యూహాలు తెలుసుకోవడంతో పాటు, ఒక వేళ అనుకోకుండా అధికారంలోకి వస్తే వారందరిని పార్టీలో ఒక వర్గంగా మార్చి జగన్ ని దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ అని భావిస్తున్నారు.
ఈ వ్యూహం తెలియకుండా జగన్ వచ్చిన అందరిని పార్టీలో చేర్చేసుకుంటున్నాడు అనే మాట వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే ఎన్నికలు అయ్యి, ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.