మెగా డాటర్ నిహారిక హీరోయిన్గా వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అయితే ఆమెకు మాత్రం పెద్దగా సక్సెస్లు దక్కడం లేదు.
ఆమె చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉంది.తాజాగా ఈమె ‘సూర్యకాంతం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి ఆ చిత్రం ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈమె హీరోయిన్గా నేను శైలజ చిత్రం చేయాల్సి ఉందట.
కాని మిస్ అయ్యిందని చెప్పుకొచ్చింది.
రామ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా రూపొందిన ‘నేను శైలజ’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అలాంటి సినిమాలో ఈఅమ్మడికి అవకాశం వచ్చిందట.కీర్తి సురేష్కు ముందు నిహారికను దర్శకుడు సంప్రదించాడట.
అయితే అప్పటికి నిహారిక హీరోయిన్గా పరిచయం కాలేదు.మొదటి సినిమా చేస్తోందట.
ఆ సినిమా పూర్తి అయితే తప్ప తర్వాత సినిమాకు కమిట్ కావద్దనే ఉద్దేశ్యంతో నేను శైలజ చిత్రాన్ని వదిలేసిందట.
ఆ సినిమాను చేసి ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందని ఈ సందర్బంగా నిహాకిర చెప్పింది.అయినా తాను కెరీర్లో కమర్షియల్ సక్సెస్లు దక్కించుకోలేక పోయినా ఒక మంచి నటిగా మాత్రం గుర్తింపు దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్బంగా నిహారిక చెప్పుకొచ్చింది.సూర్యకాంతం సినిమా సక్సెస్ అయితే నిహారిక కమర్షియల్ హీరోయిన్గా మారిపోయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.