మెగా హీరో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్తో తర్వాత సినిమా ఎంపిక విషయంలో చాలా ఆలోచించాడు.ఆరు నెలల పాటు ఎన్నో కథలు విన్న తర్వాత విక్రమ్ కుమార్తో ఒక సినిమాకు సిద్దం అయ్యాడు.
అయితే ఆయన కథ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది, దాంతో ఆయన ప్రాజెక్ట్ను కూడా పక్కకు పెట్టాడు.ఆ లోపు తనకు రెండు సక్సెస్లు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ రావడంతో వెంటనే త్రివిక్రమ్కు డేట్లు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.
ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా పట్టుదలతో ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ పుకార్లు వస్తున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ పూర్తి అయిన వెంటనే ‘ఎంసీఏ’ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందట.
అయితే ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు.వేణు శ్రీరామ్ ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఆయన చేసిన ‘ఓమైఫ్రెండ్’ మరియు ‘ఎంసీఏ’ చిత్రాలు ఆకట్టుకోలేక పోయాయి.
అందుకే ఆయన దర్శకత్వంలో చిన్న హీరోలు కూడా నటించేందుకు ఆసక్తిగా లేరు.ఇలాంటి సమయంలో ఆయన్ను బన్నీ నమ్ముతాడని తాము భావించడం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
అల్లు అర్జున్ సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.త్రివిక్రమ్ తర్వాత విక్రమ్ కుమార్ లేదా లింగు స్వామి దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు.
అయితే సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం దిల్రాజు కోరిక మేరకు వేణు శ్రీరామ్ చెప్పిన కథను బన్నీ విన్నాడని, కథ నచ్చడంతో వెంటనే నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.దిల్రాజుపై నమ్మకంతో పాటు, కథ ఆకట్టుకునే విధంగా ఉన్న కారణంగా బన్నీ ఈ సినిమాకు ఓకే చెప్పాడు అంటున్నారు.అయితే ఇంకా త్రివిక్రమ్ మూవీనే ప్రారంభం కాలేదు.అప్పుడే ఆ సినిమా గురించిన చర్చలు ఏంటీ అంటూ మెగా సన్నిహితులు మీడియాను ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతానికి త్రివిక్రమ్ మూవీపైనే బన్నీ దృష్టి ఉందని వారు క్లారిటీ ఇచ్చారు.