టాలీవుడ్ లో ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన పెర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఫిదా సినిమాతో తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా తెలుగులో ఎంసిఎ, పడిపడి లేచే మనసు సినిమాలు చేసింది.
అయితే ఈ రెండు ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో సాలిడ్ హిట్స్ ఇవ్వలేకపోయింది.అయిన ఈ భామ నటనకి ఫిదా అయిన సౌత్ దర్శకులు అవకాశాలు ఇచ్చేందుకు మాత్రం వెనుకాడటం లేదు.
అయితే సాయి పల్లవి వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే ఒకే చెప్పకుండా తన మనసుకి నచ్చే కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఈ నేపధ్యంలో త్వరలో తెలుగు లో విరాటపర్వం అనే సినిమాలో రానాతో కలిసి నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామకి తమిళంలో మాత్రం స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ లు వస్తున్నాయి.తమిళంలో మొదటి సినిమా కణం సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్నా ధనుష్, కి జోడీగా మారి 2 లో అలాగే సూర్యకి జోడీగా ఎంజీకే అనే సినిమాలో చేస్తుంది.
ఇదిలా ఉంటే తన మొదటి సినిమా దర్శకుడు, అమల పాల్ మాజీ భర్త విజయ్ తో ఆమె చాలా కాలంగా సన్నిహితంగా ఉంటుంది అని, త్వరలో ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు బయటకి వచ్చాయి.ఇవి కాస్తా వైరల్ గా మారడంతో ఇప్పుడు దర్శకుడు విజయ్ వాటికి క్లారిటీ ఇచ్చాడు.ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేసాడు.దీంతో ఈ రూమర్స్ కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడ్డట్లు అయ్యింది.