రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వర్మ పదే పదే ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు.అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదు.
అలాంటప్పుడు ఈ సినిమాను థియేటర్లలో ఎలా విడుదల చేస్తావు వర్మ అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రేక్షకులను మోసం చేసే విధంగా వర్మ కామెంట్స్ చేస్తున్నాడని, అసలు వర్మ ఇప్పటి వరకు సినిమా విడుదలకు క్లియరెన్స్ తీసుకోలేదు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తాను అన్న విషయం తెల్సిందే.ఒక వేళ సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటే మాత్రం డైరెక్ట్గా యూట్యూబ్లో విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ 29వ తారీకున విడుదల చేస్తాను అంటూ బలంగా చెబుతున్న నేపథ్యంలో సినిమాను యూట్యూబ్లో విడుదల చేసే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు దేశం పార్టీని, అధికారంను చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో హ్యాండోవర్ చేసుకున్నాడు అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.చంద్రబాబు నాయుడును విలన్గా వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు.ఎన్టీఆర్ మరియు లక్ష్మీ పార్వతిల మద్య ఉన్న అనురాగంను కూడా ఈ చిత్రంలో తాను చూపిస్తున్నట్లుగా వర్మ ప్రకటించాడు.
మొత్తానికి ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసినా సినిమా విడుదలకు మాత్రం ఇబ్బంది తలెత్తుతుంది.ఒక వేళ ఈనెల 29న కూడా విడుదల కాకుంటే మాత్రం ఎన్నికలు పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.