ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్బుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హీరో వెంకటేష్ ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు.పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, రామ్ తో మసాలా చిత్రాలను చేసిన వెంకీ తాజాగా వరుణ్ తేజ్తో ఎఫ్ 2 చిత్రాన్ని చేసి సూపర్ హిట్ను దక్కించుకున్నాడు.
ఎఫ్ 2 చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వెంకీకి ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం అల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
ఇదే సమయంలో రవితేజతో కలిసి మరో మల్టీస్టారర్లో నటించేందుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరు పోట్ల దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ రూపొందబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వెంకీమామ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే వీరు పోట్లకు వెంకీ డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు రవితేజ కూడా డిస్కోరాజా చిత్రం పూర్తి అయిన తర్వాత ఈ మల్టీస్టారర్లో నటించాలని నిర్ణయించుకున్నాడు.అంతా అనుకున్నట్లుగా జరిగితే వచ్చే జులైలో సినిమా పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.
వెంకటేష్ ఈమద్య కాలంలో మల్టీస్టారర్ అనగానే గుర్తుకు వస్తున్నాడు.ఏ దర్శకుడు మల్టీస్టారర్ సబ్జెక్ట్ అనుకున్న వెంటనే వెంకటేష్ను ఆశ్రయిస్తున్నారు.వెంకీకి ఉన్న మంచి అలవాటు ఏంటీ అంటే ఇతర హీరోలతో ఎలాంటి బేషజాలు లేకుండా నటిస్తాడు.అందుకే ఆయన వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నాడు.ముందు ముందు కూడా వరుసగా వెంకీ మల్టీస్టారర్ చిత్రాలు చేసే అవకాశాలున్నాయి.