మనిషి కొన్ని సమయాల్లో సైకోగా మారతాడు, అయితే ఆ సమయంలో మనసును అదుపులో పెట్టుకోవడంతో పాటు, కాస్త సంయమనం పాటిస్తే అంతా బాగుంటుంది.కాని ఒక వ్యక్తి మాత్రం తనకు వచ్చిన కోపంను ఆపుకోలేక అత్యంత దారుణమైన పనికి ఒడి కట్టాడు.
అతడు సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు.అతడు చేసిన పనికి అతడిని మనిషిగా కాకుండా రాక్షసుడిగా చూడాలని అంతా కూడా కోరుతున్నారు.
ఒక మూగ జీవంపై తన ప్రతాపం చూపడంతో పాటు, అతడికి ఏమాత్రం కారణం కాని ఆ మూగ జీవంను ఇష్టం వచ్చినట్లుగా హింసించి దారుణానికి ఒడి గట్టాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే….
అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉండే 19 ఏళ్ల లారెన్స్ గ్రాహమ్ అనే కుర్రాడు స్కూల్లో పార్ట్టైం జాబ్ చేస్తూ ఉన్నాడు.అతడు తన స్నేహితురాలితో సహజీవనం సాగిస్తూ ఒకే ఇంట్లో ఉంటున్నారు.
ఆమె ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగంను చేస్తోంది.ఇద్దరు కూడా ఒకరు అంటే ఒరు చాలా ఇష్టం.
ఒక రోజు లారెన్స్ గ్రాహమ్ తన గర్ల్ ఫ్రెండ్కు ఫోన్ చేసి అర్జెంట్గా ఇంటికి వచ్చేయమన్నాడు.ఆఫీస్లో పని ఉన్న కారణంగా ఆమె రావడం కుదరదు అంటూ ఫోన్ పెట్టేసింది.
దాంతో కోపోద్రిక్తుడు అయిన లారెన్స్ విచక్షణ కోల్పోయాడు.ఆమెపై కోపంను ఆమె ఇష్టంగా పెంచుకునే పెంపుడు కుక్కపై చూపించాడు.
మరోసారి ఆమెకు ఫోన్ చేసిన లారెన్స్ నువ్వు ఇంట్టో రాత్రి 10.30 వరకు ఉండకుంటే నీవు ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్క పిల్ల నీకు దక్కదు అంటూ హెచ్చరించాడు.దాంతో ఆమె కంగారు పడి ఇంటికి బయలు జేరింది.ఇంటికి వెళ్లేప్పటికి ఆ కుక్క పిల్ల రక్తపు మడుగులో శవంలా పడి ఉంది.ఆమె కన్నీటి పర్యంతం అయ్యి పోలీసులకు ఫోన్ చేసింది.పోలీసుల ఎంక్వౌరీలో అతడు కుక్క పిల్లపై అఘాయిత్యంకు పాల్పడటంతో పాటు, ఆ తర్వాత కుక్కను నేలకేసి కొట్టి, ఆ తర్వాత వైర్ తో మెడను బలంగా లాగి దాన్ని ఇష్టం వచ్చినట్లుగా చేసి చంపేశాడట.
ఆ కుక్క పిల్లను అతడు చంపిన విధానం చూసి పోలీసులు కూడా అవాక్కవుతున్నారు.అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.
ఇలాంటి వాడితో ఇన్నాళ్లు ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.